పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం! గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు భారీ నోటిఫికేషన్!
Wed Feb 12, 2025 18:03 Others![](http://andhrapravasi.com/wp_dashboard/post_images/పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం!.202502120237.jpg)
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో భారీగా ఉద్యోగాల భర్తీకి తాజాగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. ఈపోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్లో 1215, తెలంగాణలో 519 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు.
ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు!
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు..
ఆంధ్రప్రదేశ్ పోస్టుల సంఖ్య: 1,215
అస్సాం పోస్టుల సంఖ్య: 555
బీహార్ పోస్టుల సంఖ్య: 783
ఛత్తీస్గఢ్ పోస్టుల సంఖ్య: 638
ఢిల్లీ పోస్టుల సంఖ్య: 30
గుజరాత్ పోస్టుల సంఖ్య: 1,203
హరియాణా పోస్టుల సంఖ్య: 82
హిమాచల్ప్రదేశ్ పోస్టుల సంఖ్య: 331
జమ్మూ అండ్ కశ్మీర్ పోస్టుల సంఖ్య: 255
జార్ఖండ్ పోస్టుల సంఖ్య: 822
కర్ణాటక పోస్టుల సంఖ్య: 1,135
కేరళ పోస్టుల సంఖ్య: 1,385
మధ్యప్రదేశ్ పోస్టుల సంఖ్య: 1,314
మహారాష్ట్ర పోస్టుల సంఖ్య: 1,498
నార్త్ ఈస్ట్రన్ పోస్టుల సంఖ్య: 1,260
ఒడిశా పోస్టుల సంఖ్య: 1,101
పంజాబ్ పోస్టుల సంఖ్య: 400
రాజస్థాన్ పోస్టుల సంఖ్య: 2718
తమిళనాడు పోస్టుల సంఖ్య: 2,292
తెలంగాణ పోస్టుల సంఖ్య: 519
ఉత్తర్ ప్రదేశ్ పోస్టుల సంఖ్య: 3,004
ఉత్తరాఖండ్ పోస్టుల సంఖ్య: 568
పశ్చిమ్ బెంగాల్ పోస్టుల సంఖ్య: 923
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎవరైనా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. అయితే మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరిగా సబ్జెక్టులుగా చదివి ఉండాలి. వీరికి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. సైకిల్ తొక్కటం కూడా వచ్చి ఉండాలి. అభ్యర్ధుల 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో మార్చి 3, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లింపులు ఉండవు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకైతే రూ.12000 నుంచి రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన వారిని ఖాళీగా ఉన్న బ్రాంచీలు, హోదా ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 10, 2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 03, 2025.
దరఖాస్తు సవరణలకు అవకాశం: మార్చి 6, 2025 నుంచి మార్చి 8, 2025 వరకు
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..
వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!
చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #post #jobs #details #todaynews #flashnews #latestupdate
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.